ఖమ్మం జిల్లా ఎదులాపురంలో ఇందిరమ్మ ఇళ్ల జియో ట్యాగింగ్ కోసం వచ్చిన గృహ నిర్మాణ శాఖ ఏఈ బొమ్మకంటి లావణ్యతో అసభ్యంగా ప్రవర్తించిన సిహెచ్ భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఏఈని దూషించి, చేయి చేసుకున్నట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.