TG: కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలే దాడిచేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసులు కాంగ్రెస్, MIM పార్టీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డికి వెళ్లకుండా రాంచందర్ రావును హౌస్ అరెస్టు చేశారని, తమను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ఘటనల్లో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ASF: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో యథావిధిగా వినతుల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
KMM: భూ కబ్జాల పేరుతో పేదలను మోసం చేస్తే సహించేది లేదని RI ప్రసాద్ తెలిపారు. ఏదులాపురం కేంద్రీయ విద్యాలయం సమీపంలోని సుమారు రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమి ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. MRO రాంప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్ఐ సిబ్బందితో కలిసి ఆదివారం జేసీబీతో అక్రమ పునాదులను తొలగించారు. అనంతరం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
మహబూబాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు వినియోగించుకోవాలని కోరారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. జోర్డాన్లో మార్చి 6 వరకు జరగాల్సిన చిత్రీకరణ, స్థానిక జూనియర్ ఆర్టిస్టుల కొరత, లాజిస్టిక్ సమస్యల వల్ల ముందుగానే ముగిసిందట. దీంతో మిగిలిన చిన్నపాటి సీన్లను HYDలోని RFCలో వేసిన ప్రత్యేక సెట్స్లో పూర్తి చేయనున్నారట. FEB 25నే మేకర్స్ తిరిగి HYDకి రానున్నట్లు టాక్.
CTR: అరగొండలోని పురాతన చరిత్ర కలిగిన శివాలయంలో ఆదివారం ఉదయం కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అపోలో అధినేత ప్రతాప్ సి రెడ్డి సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
MBNR: బాదేపల్లి పాతబజార్కు చెందిన హమాలీ సుంకసారి శ్యామ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో రాయచూర్ డెమో ఎక్స్ప్రెస్ కింద పడి తనువు చాలించాడు. రైల్వే ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము వివాహమై 14 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండంతో శ్యామ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలిపారు.
BDK: ఫిల్టర్ బెడ్ను రిపేర్ చేసి నీటిపై నాచు లేకుండా చూడాలని సీపీఐ నాయకులు కోరారు. కొత్తగూడెం టౌన్ రామవరం ప్రజల నీటి ఎద్దడిని సింగరేణి యాజమాన్యం తీర్చాలని మాజీ కౌన్సిలర్లు కోరారు. ఆదివారం రామవరం సీపీఐ ప్రతినిధి బృందం ఫిల్టర్ బెడ్ను సందర్శించారు. తక్షణమే రెండు పూటల మంచినీళ్లు అందించాలని, స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
KRNL: ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం మహమ్మద్ ఆధ్వర్యంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం భాగంగా పబ్లిక్ హెల్త్ వర్కర్లకు ఆదివారం క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు పనులను ఒత్తిడిగా కాకుండా ఉత్సాహంతో నిర్వహించాలన్నారు.
వేయించిన శనగల్లో పుష్కలంగా ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తాయి. క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉండటంతో బరువు పెరగకుండా దోహదపడతాయి. కండరాలు, ఎముకల పనితీరును మెరుగుపరిచే కాల్షియం, మెగ్నీషియం శనగల్లో లభిస్తుంది. వీటిలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే నిత్యం గుప్పెడు నోట్లో వేసుకొని పోషకాలను పొందండి.
HYD: ఫిబ్రవరి నెల ముగియకముందే HYDలో ఎండలు మండుతున్నాయి. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తప్పడం లేదు. బయటకు వెళ్తే టోపీనో, గొడుగో తీసుకెళ్లాల్సి వస్తోంది. భానుడి ప్రతాపంతో.. సహజంగా నడి వేసవిలో కనిపించే ఎండమావులు ఇప్పుడే ఏర్పడుతున్నాయి. కాగా, ఏప్రిల్, మే నెలల్లో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
NZB: అర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 43వ స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం నిర్వహించారు. ఆవరణలో ఉన్న చెత్త తొలగించి ఆవరణలో ఉన్న వాటిని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఆర్మూర్ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.
TG: మెదక్ జిల్లా చేగుంట రైల్వే స్టేషన్ రోడ్డులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. త్రిమూర్తి అనే వ్యక్తి తన భార్య వరలక్ష్మి(36) గొంతుకోసి చంపాడు. నగల కోసమే భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న త్రిమూర్తి కోసం పోలీసు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ASR: విశాఖ ఉమ్మడి జెడ్పీ సమావేశంలో అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు అధికారుల తీరుపై మండిపడ్డారు. సరైన వైద్యం అందక గిరిజనులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల బిల్లుల్లో కమీషన్లు, ఐకేపీ నిధుల దుర్వినియోగాన్ని సభలో నిలదీశారు. ఆశ్రమ పాఠశాలల్లో గంజాయి మాఫియాను అరికట్టాలని, విధులకు గైర్హాజరయ్యే టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
SDPT: గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. తొలి విడతగా అక్కన్నపేట మండలానికి చెందిన 38 గ్రామపంచాయతీ సర్పంచులు శిక్షణను పూర్తి చేశారు. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు, పరిపాలన నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుంది.