ASR: విశాఖ ఉమ్మడి జెడ్పీ సమావేశంలో అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు అధికారుల తీరుపై మండిపడ్డారు. సరైన వైద్యం అందక గిరిజనులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల బిల్లుల్లో కమీషన్లు, ఐకేపీ నిధుల దుర్వినియోగాన్ని సభలో నిలదీశారు. ఆశ్రమ పాఠశాలల్లో గంజాయి మాఫియాను అరికట్టాలని, విధులకు గైర్హాజరయ్యే టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.