AP: అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో బిల్లులో పెట్టాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. లేకపోతే ఈ బిల్లుకు అర్థమే లేకుండా పోతుందన్నారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే 54 వేల ఎకరాలు సేకరించారని తెలిపారు. రాజధాని కోసం మరింత భూమి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. అమరావతి చట్టబద్ధత బిల్లుతో రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు.