TG: కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలే దాడిచేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసులు కాంగ్రెస్, MIM పార్టీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డికి వెళ్లకుండా రాంచందర్ రావును హౌస్ అరెస్టు చేశారని, తమను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ఘటనల్లో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.