• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై అవగాహన ఉండాలి’

ASR: ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన ఉండాలని చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయభారతి అన్నారు. విజ్ఞానయాత్రలో భాగంగా స్థానిక ఎంపీడీవో, రెవెన్యూ, విద్యాశాఖ కార్యాలయాలు, న్యాయస్థానాన్ని శనివారం బీఏ విద్యార్థులకు చూపించారు. వివిధ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే అధికారులు, ఉద్యోగులు, విధులు వివరాలను విద్యార్థులకు వివరించారు.

February 22, 2026 / 09:23 AM IST

రేపు డీఆర్డీఏలో ఉద్యోగ మేళా

TPT: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం కోటక్ మహీంద్ర మైక్రో ఫైనాన్స్ సంస్థలో ‘ట్రైనింగ్ సెంటర్ ఆఫీసర్’ భర్తీకి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శోభన్‌బాబు తెలిపారు. పది నుంచి పీజీ వరకు చదివి వయసు 21-25 సంవత్సరాల వారు అర్హులన్నారు. సమాచారం కోసం 87124 95517లో సంప్రదించాలన్నారు.

February 22, 2026 / 09:22 AM IST

నీటి సంపులో పడి తొమ్మిదేళ్ల బాలిక మృతి

TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడలో విషాద ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక మిల్కీ ఆడుకుంటూ వెళ్లి నీట సంపులో పడి మృతిచెందింది. అడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 09:22 AM IST

అటవీలో సాగుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

ASF: తీర్యాని మండల రిజర్వ్ అటవీలో చెట్లను నరికి సాగుకు ప్రయత్నించిన వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. FRO శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మొర్రిగూడకు చెందిన ఆత్రం గంగు అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 13 రోజుల రిమాండ్ విధించారన్నారు. అటవీ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

February 22, 2026 / 09:20 AM IST

మంచిమాట: మీ శరీరానికి మీరిచ్చే కానుక అదే..

నడకను మీ శరీరానికి ప్రతిరోజూ మీరిచ్చే కానుకగా భావించండి. క్రమం తప్పకుండా రోజూ కనీసం 7 వేల అడుగులు నడవండి. నడకను ఆస్వాదిస్తూ పూర్తి చేయాలి తప్ప భారంగానో, చేయక తప్పని పనిగానో భావించకండి. ఈ అలవాటును కొనసాగించడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. మనసు తేలికపడుతుంది.

February 22, 2026 / 09:20 AM IST

శ్రీవారి సేవలో మంత్రి అచ్చెన్న నాయుడు

SKLM: టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ వేదపండితుల మంత్రో చ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం మంత్రి ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:19 AM IST

బడంపేట జాతరకు స్పెషల్ బస్సు సౌకర్యం

SRD: జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోహిర్ మండలం బడంపేట రాచన్న స్వామి జాతరకు స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం భక్తుల ప్రయాణ సౌకర్యార్థం బస్సును ప్రారంభించారు. ఈ స్పెషల్ బస్సును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రయాణికుల రద్దీ అనుసరించి రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు.

February 22, 2026 / 09:18 AM IST

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవం

KNR: మానకొండూర్ మండలం రంగంపేటలో శ్రీ మేడలంబ కేతకాంబ సమేత మల్లికార్జున స్వామి నూతన దేవాలయం ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 09:16 AM IST

రైతులు ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

NTR: ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ రైతోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి రైతు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రతి గ్రామ క్లస్టర్‌ను ఎంచుకొని, ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:16 AM IST

ఉద్యోగం రాక యువకుడి బలవన్మరణం

MNCL: ఉద్యోగం రావట్లేదని మనస్థాపం చెంది ఓ నిరుద్యోగి ఈ నెల 19న ఘటన చెన్నూర్‌లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటబొగూడకి చెందిన కిరణ్ డిగ్రీ పూర్తి చేసి HYDలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్-2, 3, 4 పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో తన తల్లికి భారం కాకూడదని వేదన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు.

February 22, 2026 / 09:15 AM IST

‘ఆర్గానిక్ పంటలను సందర్శించండి’

BDK: మణుగూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆర్గానిక్ పంటల సాగు ద్వారా గుర్తింపు పొందిన ఆదర్శ రైతులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్గానిక్ పంటల సాగు పండించే విధానం, పంటల దిగుబడి తద్వారా పొందే మెరుగైన ఫలితాలు, వాటి ఉపయోగాలు వంటి విషయాలపై ఆదర్శ రైతు లైన యారం లక్ష్మీరెడ్డి, మేడిపల్లి ఉదయ్‌తో కలిసి వివరించారు.

February 22, 2026 / 09:15 AM IST

ఈ నెల 28న జిల్లాకు సీఎం చంద్రబాబు

VZM: ఈ నెల 28న సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి మండలం రావివలసలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారికంగా సమాచారం అందినట్లు ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు. అనంతరం అదే రోజున పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారన్నారు.

February 22, 2026 / 09:15 AM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో కమాన్‌పూర్ విద్యార్థినికి బంగారు పతకం

PDPL: రాష్ట్రస్థాయి పోటీల్లో కమాన్‌పూర్ విద్యార్థిని బంగారు పతకం సాధించింది. హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలో కమాన్‌పూర్ మండలానికి చెందిన నల్లవెల్లి ఆనంది 18 ఏళ్ల విభాగం 400 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు.

February 22, 2026 / 09:13 AM IST

ఈనెల 23న కేంద్ర బృందం పర్యటన.. కలెక్టర్ సూచనలు

జనగామ జిల్లా ఐదు పైలట్ జిల్లాల్లో ఒకటిగా ఎంపిక కావడం సంతోషకరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. RPRP కింద అమలవుతున్న 46 కేంద్ర ప్రభుత్వ పథకాల సమగ్ర తనిఖీ కోసం ఈ నెల 23న కేంద్ర బృందం జిల్లా పర్యటన జరగనుంది. కలెక్టర్ అధికారులు అన్ని కేంద్ర పథకాల అమలు వివరాలు, లబ్ధిదారుల సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.

February 22, 2026 / 09:12 AM IST

ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిస్సింగ్

KDP: ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సాయి ఊర్మిళ మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆమె భర్త సూర్యకృష్ణ స్థానిక 2-టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2-టౌన్ SI రాఘవేంద్రారెడ్డి ఆదివారం మీడియాకు ఇచ్చిన సమాచారం మేరకు.. సాయి ఊర్మిళ, సూర్య కృష్ణ దంపతులు స్థానిక గోపవరం పంచాయితీలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

February 22, 2026 / 09:12 AM IST