• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రోడ్డును బాగుచేయండి’

PPM: పార్వతీపురం మండలంలోని జమదాల నుంచి లిడికి వలసకు తారు రోడ్డు నిర్మాణం సగంలోనే ఆగింది. సుమారు 2 కి.మీ దూరం రోడ్డు రాళ్లు తేలి రవాణాకు ఇబ్బందిగా మారింది. పదేళ్ల క్రితం రోడ్డు పనులు ప్రారంభించి, జమదాల నుంచి కొత్తపాకలు వరకు వేసి వదిలేశారు. దీంతో జమదాల, బందలుప్పి, గోచెక్క, డోకిశీల, సరిహద్దు ఒడిశా ప్రాంత 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

October 13, 2025 / 10:06 AM IST

గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

W.G: తణుకు మండలం పైడిపర్రు కాలువలో పడి గల్లంతైన బొమ్మనబోయిన జోగేంద్ర (13) మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. అత్తిలి మండలం గుమ్మంపాడు సమీపంలో కాలువలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

October 13, 2025 / 10:06 AM IST

అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం

AP: రాజధాని అమరావతిలో CRDA ప్రధాన కార్యాలయ భవనాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చ.అ. విస్తీర్ణంలో 7 ఫ్లోర్లలో (G+7) CRDA భవనాన్ని నిర్మించారు. CRDA సహా.. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ‘A’ అక్షరం ఎలివేషన్‌తో తీర్చిదిద్దారు.

October 13, 2025 / 10:05 AM IST

ఉమ్మడి జిల్లా రిజిస్టర్‌గా రవీందర్ రావు నియామకం

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా రిజిస్టర్‌గా రవీందర్ రావును నియమిస్తూ, రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ తెలంగాణ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లా రిజిస్టర్‌గా పనిచేస్తున్న ప్రకాష్‌ను మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు బదిలీ చెయ్యగా, ఖమ్మంలో పనిచేస్తున్న రవీందర్రావును పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

October 13, 2025 / 10:05 AM IST

గుప్తనిధుల ఘటన.. నిందితులు వీరే

CTR: పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకున్న గుప్తనిధుల ఘటనలో నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. కెళవాతికి చెందిన శ్రీనివాసులు, చెన్నైకి చెందిన శరవణ, పుంగనూరు మండలానికి చెందిన శ్రీనివాసులు, ప్రకాష్, శ్రీనివాసరెడ్డి తవణంపల్లి మండలానికి చెందిన రమేష్ కలికిరి మండలానికి చెందిన జేసీబీ డ్రైవర్ సునీల్ వారిలో ఉన్నారు.మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

October 13, 2025 / 10:04 AM IST

క్రీడాకారులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలి: సీపీ

విశాఖ: మన్మథ‌రావు మెమోరియల్ క్లబ్ నిర్వహించిన బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులు చిత్తశుద్ధితో ఎదిగి తల్లిదండ్రులు, గురువుల నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన కోరారు. ఈ టోర్నమెంట్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ గర్ల్స్ టీమ్ విజేతగా, సెయింట్ అల్లోయిసిస్ స్కూల్ రన్నర్‌గా నిలిచాయి.

October 13, 2025 / 10:04 AM IST

కర్నూల్ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది: పల్ల

KRNL: కర్నూల్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ప్రధాని మోదీ సభా ప్రాంగణం పరిశీలించిన ఆయన, ఈ నెల 16న మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీ ప్రారంభోత్సవం జరగనుందని చెప్పారు. మోదీ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను ఆయన సూచించారు.

October 13, 2025 / 10:03 AM IST

మేడారం సమీక్షకు మంత్రి కొండా గైర్హాజరు

MLG: తాడ్వాయి మండలం మేడారం జాతర పనుల సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇవాళ హాజరుకావట్లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేదాల కారణంగా ఆమె ఈ సమావేశానికి రావట్లేదని తెలుస్తోంది. మేడారం అభివృద్ధి పనుల టెండర్ల పై మంత్రుల మధ్య గొడవలు నెలకొనడంతో సురేఖ టూర్ షెడ్యూల్ విడుదల కాక, సమీక్షకు గైర్హాజరైనట్లు సమాచారం.

October 13, 2025 / 09:58 AM IST

ప్రభాకర్ రెడ్డి, శైలజనాథ్ ఆత్మీయ పలకరింపు

ATP: తాడిపత్రిలో జరిగిన ఓ వేడుకలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత సాకే శైలజనాథ్ కలిశారు. వేరు వేరు పార్టీలకు చెందిన వారు ఆప్యాయంగా పలకరించుకోవడాన్ని అక్కడి వారు ఆసక్తికరంగా తిలకించారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ ఆరోగ్యంపై ప్రభాకర్ రెడ్డి ఆరా తీశారు. రాజకీయాలకు అతీతంగా ఇలా మాట్లాడుకోవడం శుభ పరిణామమని స్థానికులు అభిప్రాయపడ్డారు.

October 13, 2025 / 09:50 AM IST

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను ఇవాళ విడుదల చేయనుంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి, నోటిఫికేషన్ విడుదల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు సమర్పించవచ్చు. ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో నామినేషన్లను స్వీకరిస్తారు.

October 13, 2025 / 09:49 AM IST

టేకు చెట్లు నరికిన వ్యక్తికి రిమాండ్

MNCL: దండేపల్లి మండలంలోని తానిమడుగు బీట్ పరిధిలో టేకు చెట్లు నరికిన రాజేష్‌ను రిమాండ్‌కు తరలించామని తాళ్లపేట ఎఫ్ఆర్‌వో సుష్మారావు తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. తానిమడుగు బీట్‌లోని 394వ కంపార్ట్మెంట్‌లో నరికిన టేకు చెట్ల వద్ద డాగ్ స్వాడ్‌కు ఆధారాలు చూపించగా రాజేష్ ఇంటి వద్ద ఆగిందన్నారు. రాజేష్ చెట్లను నరకడంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.

October 13, 2025 / 09:47 AM IST

భారీ వర్షం.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్

CTR: ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తవణంపల్లి మండలంలో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రోడ్లపై భారీగా నీరు చేరింది. మండలంలో అన్ని చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తొడతర, గాజులపల్లి, మత్యం, జొన్న గురకల, పుణ్య సముద్రం, కాణిపాకం, గ్రామాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

October 13, 2025 / 09:45 AM IST

ధాన్యం తరలించేందుకు GPS తప్పనిసరి: JC

SKLM: ఖరీఫ్ సీజన్‌‌లో ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనానికి కచ్చితంగా జీపీఎస్ పరికరం అమర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. సోమవారం ప్రకటన విడుదల చేస్తూ దీనికోసం ఆసక్తి ఉన్న వాహనదారులు ముందుగా GSTతో కలిపి రూ.3,068 రూపాయలు చెల్లించి, జీపీఎస్ అమర్చుకోవాలన్నారు. అప్పుడే ధాన్యం రవాణా చేయడం జరుగుతుందన్నారు.

October 13, 2025 / 09:44 AM IST

మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం

PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కార్యదర్శి డీ. మౌనిక తెలిపారు. ఒక్క బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని, నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు, సబ్సిడీపై మిషన్లు అందిస్తామని తెలిపారు.

October 13, 2025 / 09:43 AM IST

మిర్చి కిరాయి వివాదం పరిష్కారానికి ఎమ్మెల్యే

GNTR: గుంటూరు మిర్చి యార్డ్‌లో లారీ యజమానులు, ఎగుమతిదారుల మధ్య కొనసాగుతున్న కిరాయి వివాదాన్ని పరిష్కరించేందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి చొరవ తీసుకున్నారు. ఈ వివాదం కారణంగా వ్యాపారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆదివారం ఇరుపక్షాల సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

October 13, 2025 / 09:43 AM IST