ADB: రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని SP అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా ‘ఖాకీ కిడ్స్’ పేరుతో నూతన కార్యక్రమాన్ని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శనివారం లాంచనంగా ప్రారంభించారు. విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
VZM: అనకాపల్లి జిల్లా బత్తివానిపాలెం వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా రాచకిండాం గ్రామానికి చెందిన లావణ్య మృతి చెందింది. సోదరుడి పెళ్లి వేడుక అనంతరం నూతన వధూవరులతో నిన్న శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లావణ్య మృతి చెందగా నవ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ‘పుష్ప 2’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకోవడంతో ఆయన ఖాతాలో మొత్తం 7 అవార్డులు చేరాయి. దీనితో అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డును బన్నీ సమం చేశాడు. యంగ్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా అల్లు అర్జున్ ఇప్పుడు టాప్లో నిలిచాడు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం అన్నికంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
W.G: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీ, ప్రస్తుతం జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
PDPL: సింగరేణి సంస్థ 6 జిల్లాలలో 2025-26 ఆర్థిక సంవత్సర టార్గెట్ 72 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తిని చేరుకోవడానికి అధికారులు, ఉద్యోగులు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 51.70MT బొగ్గు ఉత్పత్తి చేయబడి, 82% రీచ్ నమోదు అయింది. మార్చి చివరిలో 20.30MT బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున, అధికారులు ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
VSP: చింతపల్లి మండలంలో మొత్తం 16,127మంది రైతులకు గాను ఇప్పటి వరకూ 9,600మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేశామని ఏవో మధుసూదనరావు తెలిపారు. పెండింగ్లో ఉన్న 6,527మందికి రైతులకు త్వరలో పూర్తి చేస్తామన్నారు. గెంజిగెడ్డ గ్రామంలో పర్యటించారు. ఆర్ఎస్కే సిబ్బందితో కలిసి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ చేశారు. ఫార్మర్ రిజిస్ట్రీ గడువు దగ్గర పడుతుందన్నారు.
SKLM: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో టెక్కలి MLA, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం తిరుపతిలో మర్యాదపూర్వకంగా భేటీఅయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగా భివృద్ధి, రైతుల సంక్షేమ పథకాల అమలు పై చర్చించారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిని కోరారు.
ఒడిశా ఝార్సుగూడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే-44పై పోలీస్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారాన్ని అందించినట్లు ఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు.
నాకౌట్ మ్యాచ్లలో దక్షిణాఫ్రికా ఎప్పుడూ భారత్ను ఓడించలేదు. ఈ రెండు జట్లు నాకౌట్ మ్యాచ్లలో రెండుసార్లు తలపడ్డాయి. భారత్ రెండింటిలోనూ గెలిచింది. 2014 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో తలపడ్డాయి. భారత్ విజయం సాధించింది. 2024 ఫైనల్లో భారత్ గెలుపొందింది. IND, SA ఫామ్ను పరిశీలిస్తే.. రెండు జట్లు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.
NZB: ఎడపల్లి మండలంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి 15 అడుగుల ఎత్తు నుంచి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, డ్రైవర్ సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TPT: సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో కొత్త మినరల్ వాటర్ ప్లాంట్ను ఆదివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రజలకు నాణ్యమైన శుద్ధి నీటిని అందించే ప్రయత్నంలో ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నాయకులు, ప్లాంట్ యజమాని నాగరాజు మోడలియార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు.
SDPT: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా, 20 మంది ప్రయాణికులకు గాయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లికి చెందిన విద్యార్థి చిత్వాన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా, మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటిన చిత్వాన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంలో పీఈటీ వెంకట నర్సయ్య కృషి విశేషమని పేర్కొన్నారు.