• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

VZM: విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ బుధవారం తెలిపారు. ఖతార్‌లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలకు అక్టోబర్ 13వరకు, జర్మనీలో ఫిజియోథెరపీ, ఓటీ టెక్నీషియన్ ఉద్యోగాలకు అక్టోబర్ 15 వరకు, రష్యాలో మెటలర్జీ కోర్సుకు అక్టోబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

October 8, 2025 / 08:33 PM IST

‘తహసీల్దార్ బదిలీని ఎమ్మెల్యే అడ్డుకోరాదు’

KRNL: ఆదోనిలో వరదల సమయంలో తహసీల్దార్ అందుబాటులో లేక నిర్లక్ష్యం చేశారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ తెలిపారు. తహసీల్దార్ నిర్లక్ష్యాన్ని గమనించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, బదిలీకి రంగం సిద్ధమైందన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే కాపాడే ప్రయత్నం మానుకోవాలని ఆయన కోరారు.

October 8, 2025 / 08:31 PM IST

10న రాజమండ్రిలో జాబ్ మేళా: కలెక్టర్

E.G: రాజమండ్రిలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన 35 ఏళ్ల లోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

October 8, 2025 / 08:30 PM IST

అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

సత్యసాయి: నల్లమాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై 2020 డిసెంబరులో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు బండి ఆదినారాయణకు 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5వేల జరిమానా పడింది. ఈ మేరకు అనంతపురం పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

October 8, 2025 / 08:29 PM IST

“ఛలో నర్సీపట్నం” విజయవంతం చేయండి

VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం YS జగన్ ఆధ్వర్యంలో “చలో నర్సీపట్నం” ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తూ గురువారం ఉ 9 గంటలకు నర్సీపట్నంకు కార్లతో భారీ ర్యాలీని నిర్వహించి సంఘీభావం తెలుపుతున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలన్నారు.

October 8, 2025 / 08:29 PM IST

హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

ADB: నామినేషన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సమర్పించేలా అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆర్‌జే, ఏఆర్‌ల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జడ్పీ సీఈవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించుకోవాలని తెలిపారు.

October 8, 2025 / 08:29 PM IST

పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్

NRML: స్థానిక సంస్థల ఎన్నికలలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)ని కలెక్టర్ అభిలాష అభినవ్ ఇవాళ ప్రారంభించారు. కలెక్టరేట్లోని సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సామాజిక మాధ్య మాల్లో వచ్చే ప్రతి వార్తపై నిఘా ఉంచాలని నిర్వహకులకు సూచించారు.

October 8, 2025 / 08:27 PM IST

పేకాట స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

GNTR: చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘డ్రోన్ గస్తీ’ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లపాడు డంపింగ్ యార్డ్‌లో పేకాట ఆడుతున్న ముగ్గురిని సీఐ రామానాయక్ సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.16,900 నగదును సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

October 8, 2025 / 08:26 PM IST

లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు

BDK: భద్రాచలం చత్తీస్గడ్ నారాయణపూర్ జిల్లా పోలీసుల ఎదుట 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మహిళలు సహా మొత్తం 16 మంది మావోయిస్టులు లొంగిపోగా, వారిపై 70 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు గతంలో పలు విధ్వంసకర సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.

October 8, 2025 / 08:25 PM IST

7వ బెటాలియన్‌లో ఘనంగా బ్రహ్మోత్సవాలు

NZB: రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్‌పల్లి కమాండెంట్ దంపతులు భవాని, సత్యనారాయణ ఆధ్వర్యంలో బెటాలియన్ ఆవరణలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి వనవిహారం, చక్క స్నానం ఘనంగా నిర్వహించారు. నేడు నిత్య ఆరాధన, హవనము, శేషహ హోమము, వూర్ణాహుతి హోమము చేశారు. మ.12.00 నుంచి 2.00 వరకు వనవిహారము నిర్వహించారు.

October 8, 2025 / 08:23 PM IST

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తికి 45 రోజులు జైలు శిక్ష : ఎస్పీ

SKLM: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఇటీవల నగరంలో మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించి, ట్రాఫిక్‌‌కు అంతరాయం కలిగించిన టి. సాయి (24) అనే వ్యక్తికి సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 45 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

October 8, 2025 / 08:22 PM IST

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

SKLM: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం రాత్రి కంచిలిలోకి డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు రాకముందే ఆయన నేరుగా విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించారు.

October 8, 2025 / 08:20 PM IST

ఉపాధ్యాయులకు ఘన సత్కారం

ప్రకాశం: కొత్తపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో బుధవారం గురుపూజోత్సవ వేడుకలు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ వంశీకృష్ణ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు 120 మందిని సత్కరించారు. జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

October 8, 2025 / 08:19 PM IST

SBI UPI సేవల్లో అంతరాయం

దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది. ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామంటూ యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన SBI.. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిసున్నట్లు తెలిపింది. టెక్నికల్ సమస్య వల్ల UPI వినియోగంలో సమస్యలు వచ్చాయని వాటిని పరిష్కరిస్తున్నట్లు చెప్పింది.

October 8, 2025 / 08:17 PM IST

‘ఏటీసీలో శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట’

MBNR: ఏటీసీలో శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడుతుందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రిన్సిపల్‌తో శిక్షణ గురించి తెలుసుకున్నారు.

October 8, 2025 / 08:17 PM IST