TPT: సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో కొత్త మినరల్ వాటర్ ప్లాంట్ను ఆదివారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రజలకు నాణ్యమైన శుద్ధి నీటిని అందించే ప్రయత్నంలో ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నాయకులు, ప్లాంట్ యజమాని నాగరాజు మోడలియార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు.