ASR: ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన ఉండాలని చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయభారతి అన్నారు. విజ్ఞానయాత్రలో భాగంగా స్థానిక ఎంపీడీవో, రెవెన్యూ, విద్యాశాఖ కార్యాలయాలు, న్యాయస్థానాన్ని శనివారం బీఏ విద్యార్థులకు చూపించారు. వివిధ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే అధికారులు, ఉద్యోగులు, విధులు వివరాలను విద్యార్థులకు వివరించారు.