ATP: పరిగి మండలంలోని సాగునీటి వినియోగదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ హసీనా సుల్తాన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ గెజిట్ మేరకు ఓటు హక్కు కలిగిన సాగునీటి వినియోగదారులు తమ పట్టాదారు పాసుపుస్తకం, 1బి, అడంగల్, ధృవీకరణ పత్రంతో సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని కోరారు.
HYD: నగరంలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా, రెరా, జీహెచ్ఎంసీ అధికారులకి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని భావించాలన్నారు.
తిరుగుబాటు నేపథ్యంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ స్వదేశాన్ని వీడి రష్యా వెళ్లారు. ఈ మేరకు అసద్ తమ దేశంలో సురక్షితంగా ఉన్నారని రష్యా విదేశాంగశాఖ డిప్యూటీ మినిస్టర్ సెర్గీ ర్యాబ్కోవ్ పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లో రష్యా అవసరమైన సహాయం అందజేస్తుందని చెప్పడానికి ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఏం జరిగింది, సమస్యను ఎలా పరిష్కరించామనే విషయం బయటకు చెప్పలేనని సెర్గ...
NLG: పట్టణానికి చెందిన మాలి లావణ్య ఈ ఏడాది జూలై నెలలో గురుకుల TGT, PGT కొలువులకు ఎంపిక కాగా, ఆ తర్వాత DSCలో ఉద్యోగం, ఇటీవల గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు. 2003లో వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లు చదువుకు దూరమయ్యారు. చదువుపై ఉన్న ఆసక్తితో దూర విద్యలో డిగ్రీ, ఎంఏ పూర్తి చేశానని, భర్త ప్రోత్సాహంతోనే ఈ ఉద్యోగాలు సాధించానని అన్నారు.
NLR: దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు సచివాలయ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఇతర అవసరాల నిమిత్తం సచివాలయం వద్దకు వెళితే సచివాలయ అధికారుల జాడే కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉదయం 10.30 గంటలు దాటినా ఉద్యోగులు ఎవరూ ఉండడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
TPT: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మోక్ష మార్గం అయినటువంటి వైకుంఠద్వార దర్శనం జనవరి 10వ తేదీ నుంచి తెరుచుకోనిందని TTD వెల్లడించింది. ఈ సందర్భంగా ఆ రోజున తెల్లవారుజామున 1:45 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని పేర్కొంది. పది రోజులపాటు ఈ దర్శనం ఉంటుందని దాదాపు 7 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునేలా TTD ఏర్పాట్లు చేస్తుంది.
మంచిర్యాల: జన్నారం పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ మండల స్థాయి సెలక్షన్ పోటీలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఇందులో విద్యార్థులకు వివిధ క్రీడలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
AP: అదానీతో విద్యుత్ ఒప్పందంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున లాయర్ ఆదినారాయణ రావు, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని, విచారణను వాయిదా వేయాలని AAG శ్రీనివాస్ కోరారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. కాగా, గత విద్యుత్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ TDP నేత పయ్యావుల కేశవ్, CPI నేత కె.ర...
TPT: ఏర్పేడు మండలం మోదుగుల పాల్యం గ్రామంలో చేతి పంపు నిరుపయోగంగా మారిందని స్థానికులు తెలిపారు. పోయిన వారం వచ్చిన తుఫాన్ ప్రభావంతో గ్రామంలో కరెంట్ సరఫరా ఆగిందని చెప్పారు. దీంతో గ్రామంలో నీటి కొరత బాగా ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ఈ చేతి పంపును మరమ్మత్తులు చేయించి వాడుకలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం: తీర్థాల శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం నూతన కళ్యాణ మండప ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మద్దులపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరినాథ్ బాబు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే శ్రీ సంగమేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు.
కామారెడ్డి: మహ్మద్నగర్ మండలంలోని తుంకిపల్లి పాఠశాలను మండల విద్యాధికారి అమర్ సింగ్ బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజన పరిసరాలు పరిశీలించారు. భోజనం తయారి సమయంలో పరిశుభ్రతను పాటించి, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయనతో పాటు పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు.
SKLM: టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహన్ రెడ్డి బుధవారం ఉదయం మరణించారు. ఆయన అంత్యక్రియలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మోహన్ రెడ్డి తనకు చిరకాల అభిమాని అని పేర్కొన్నారు. ఆయనతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా నార్కట్పల్లి మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఈ నెల నేడు, రేపు మండలంలోని బి.వెల్లెంల ZPHS లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పిడి శంభులింగం తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు సొంతగ్రామం నుంచి టీంను తీసుకునిరావాలని, ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రాలను తీసుకునిరావాలని తెలిపారు.
సత్యసాయి: సినీ నటుడు మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పుట్టపర్తిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని వారు తెలిపారు.