• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతి పత్రం

BDK: జాతీయ ఎస్టి కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘం జేఏసీ నాయకులు ఇవాళ మహబూబాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలో పర్యటిస్తానని సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 10:26 AM IST

త్రిపురవరంలో రాత్రివేళ పైప్‌లైన్ గుంతల మరమ్మతులు

SRPT: అనంతగిరి మండలం త్రిపురవరంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ కోసం తవ్విన గుంతలను శనివారం రాత్రి గ్రామ పంచాయతీ సిబ్బంది పూడ్చివేశారు. గ్రామ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై గుంతల కారణంగా వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించి, తక్షణమే స్పందించి ఈ పనులు చేయించినట్లు సర్పంచ్ తెలిపారు.

February 22, 2026 / 10:25 AM IST

నగరంలో 9,142 ఫ్రీ లెఫ్ట్ కేసులు

HYD: నగరంలో రోడ్డు భద్రతకు ట్రాఫిక్ పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. గత 12 రోజుల్లో ఫ్రీ లెఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించిన 9,142 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ అంతరాయం, జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ మార్గాలను బ్లాక్ చేయడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది.

February 22, 2026 / 10:24 AM IST

బాలయ్య ‘NBK-111’లో వరలక్ష్మి శరత్ కుమార్!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK-111’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మి ‘సరస్వతి’ మూవీ ట్రైలర్ లాంచ్‌లో గోపీచంద్ మాట్లాడుతూ.. తన ప్రతి సినిమాలో ఒక పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉంటుందని, ఈ క్రేజీ ప్రాజెక్టులోనూ అది రిపీట్ కాబోతోందని హింట్ ఇచ్చాడు.

February 22, 2026 / 10:24 AM IST

ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని మహిళ

AKP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శనివారం మృతి చెందినట్లు మునగపాక ఎస్సై ప్రసాదరావు తెలిపారు. మండలంలో గణపర్తి గ్రామ సమీపంలో ఈనెల 19వ తేదీన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. స్థానికులు వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు వెళ్లడించారు.

February 22, 2026 / 10:24 AM IST

సోమవారం నుంచి ప్రజావాణి పునఃప్రారంభం

NRML: కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి ప్రజలు హాజరై తమ వినతులు, ఫిర్యాదులు సమర్పించాలని ఆమె సూచించారు.

February 22, 2026 / 10:22 AM IST

నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కౌన్సిలర్ దిలీప్ కాలనీలో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. గత కొన్ని రోజులుగా ప్రజలు వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్పందించిన కౌన్సిలర్ వీధిదీపాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వార్డులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, మౌలిక సదుపాయాల రూపకల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు.

February 22, 2026 / 10:21 AM IST

సదస్సుకు వస్తే సీఎం శాంతి దూత అవుతారు: పాల్

చెన్నైలో ఇవాళ సాయంత్రం ప్రపంచ శాంతి సదస్సు జరగనుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. ఈ సదస్సును 200 దేశాల నుంచి 200 కోట్ల మంది ఫాలో అవుతారన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ఈ సదస్సు అని, దీనికి సీఎం స్టాలిన్ వస్తే ప్రపంచ శాంతి దూత అవుతారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానించామన్నారు.

February 22, 2026 / 10:20 AM IST

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని టీఎస్ మోడల్ స్కూల్, కాలేజీలో, ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పెగడపల్లి మోడల్ స్కూల్లో ప్రభుత్వం మొదటిసారిగా ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి మార్చి 13 వరకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

February 22, 2026 / 10:20 AM IST

ఆలయానికి రూ.4,09,519 ఆదాయం

SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలోని మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 15న నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాల ద్వారా రూ.4,09,519 ఆదాయం లభించినట్లు సర్పంచ్ తోడేటి రమేశ్ తెలిపారు. ఉత్సవాల అనంతరం ఆలయ ఆవరణలో గ్రామ పెద్దల సమక్షంలో ఆదాయం, వ్యయాలు, మిగులు వివరాలను వెల్లడించారు. ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం విశేషంగా ఉందన్నారు.

February 22, 2026 / 10:20 AM IST

‘పోలీస్ క్రీడల్లో జిల్లా మహిళా కానిస్టేబుల్‌కు పథకాలు’

ADB: తెలంగాణ రాష్ట్ర పోలీసు గేమ్స్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లాకు సంబంధించిన మహిళా కానిస్టేబుళ్లు అద్భుత ప్రదర్శన ప్రదర్శించి 400, 800 మీ. పరుగులో పూజ, యోగ కానిస్టేబుల్‌లు స్వర్ణ పథకాలు సాధించారు. 70 కిలోల క్యాటగిరిలో వెయిట్ లిఫ్టింగ్‌లో రూప్ సింగ్ కాంస్య పతకం పొందారు. జిల్లాకు పథకాలు రావడం పట్ల SP అఖిల్ మహాజన్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 10:20 AM IST

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌ రద్దయితే?

T20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని, వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపింది. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే అప్పుడు భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల‌కు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు.

February 22, 2026 / 10:20 AM IST

జిన్నారంలో స్వచ్ఛందంగా మూతపడ్డ మాంసం దుకాణాలు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఆదివారం మాంసం దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జీవన జ్యోతిర్లింగా శివాలయ ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దల సూచన మేరకు భక్తులు మాంసాహారం వర్జిస్తూ నియమ నిష్టలు పాటిస్తున్నారు. దుకాణదారులు కూడా భక్తి భావంతో సహకరించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

February 22, 2026 / 10:19 AM IST

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ

SRCL: తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. బహుజన వీరుడు పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పొన్నం తిరుపతి గౌడ్‌తో పాటు, సభ్యులు పాల్గొన్నారు.

February 22, 2026 / 10:18 AM IST

హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు అవగాహన

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద హెల్మెట్ ధరించడంపై ఎస్సై చంటిబాబు వాహనదారులకు ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రజల భద్రత పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

February 22, 2026 / 10:17 AM IST