సత్యసాయి: కొత్తచెరువులో శ్రీ లక్ష్మి సౌభాగ్య మహిళా కోఆపరేటివ్ బ్యాంకును ఆర్డీటీ ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విశాలా ఫెర్రర్ ప్రారంభించారు. కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల నుంచి సుమారు 800 మంది మహిళా సంఘ సభ్యులు హాజరయ్యారు. మహిళలే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా, యజమానులుగా ఉంటూ ఈ బ్యాంకును నిర్వహించనున్నారు.