• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొన్న కార్పొరేషన్ ఛైర్మన్

RR: తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు, గత పది రోజులుగా వికారాబాద్ జిల్లా, అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కలిసి పార్టీ పటిష్టత గురించి చర్చించారు.

March 2, 2026 / 04:13 PM IST

‘అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్లు’

VZM: అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్ల‌ను మంజూరు చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అన్నారు. మొద‌టి విడ‌త మంజూరు చేసిన అక్రిడేష‌న్ కార్డుల‌ను త‌మ ఛాంబ‌ర్లో అక్రిడేష‌న్ క‌మిటీ స‌భ్యుల‌కు సోమ‌వారం ఆయన అంద‌జేశారు. మిగిలిపోయిన పాత్రికేయుల‌కు రెండో విడ‌త‌లో అక్రిడేష&zwn...

March 2, 2026 / 04:13 PM IST

‘జిల్లాలో 438 మంది గైర్హాజరు’

TPT: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం జరిగాయి. జిల్లా 98 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 21,693 మంది విద్యార్థులకు గాను 21,255 మంది హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 438 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదని చెప్పారు.

March 2, 2026 / 04:13 PM IST

ఆలయ పునః నిర్మాణానికి రూ.1,16,222 విరాళం

కోనసీమ: పి.గన్నవరం మండలంలోని లంకల గన్నవరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునః నిర్మాణానికి గ్రామానికి చెందిన దివంగత పంతాల భాస్కరరావు కుటుంబ సభ్యులు రూ.1,16,222 విరాళాన్ని సోమవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ పునః నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సత్కరించారు.

March 2, 2026 / 04:13 PM IST

శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: స్పీకర్

VKB: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి స్వర్గీయ డి.శ్రీపాదరావు సేవలు మరువలేనివని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో శ్రీపాదరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పీకర్ మాట్లాడుతూ.. శ్రీపాదరావు అందించిన ఉన్నతమైన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

March 2, 2026 / 04:12 PM IST

ఏపూర్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

SRPT: ఆత్మకూరు ఎస్.మండలంలోని ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులుగా బాధ్యతలు చేపట్టి సత్తా చాటారు. ప్రధానోపాధ్యాయురాలిగా దడిగల శ్రీవర్ష, కలెక్టర్‌గా ఎల్లుట్ల అంజలి, డీఈవోగా కత్తుల శృతి, ఎంఈవోగా ఎరుకల విష్ణువర్ధన్ వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధ్యాపకులు బహుమతులు అందజేశారు.

March 2, 2026 / 04:11 PM IST

‘మన శంకరవరప్రసాద్ గారు’ 50 రోజుల రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలో తన జోరును కొనసాగిస్తుండటం విశేషం. ఏకంగా 109 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇటీవల కాలంలో ఈ ఘనత సాధించిన ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

March 2, 2026 / 04:11 PM IST

సమిష్టి కృషితో అభివృద్ధి: MLA

SRD: రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా కృషిచేసి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ తొలి మున్సిపల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీలోని పారిశుద్ధ్యం, నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన మంచి అంశాలపై దృష్టి సారించాలన్నారు.

March 2, 2026 / 04:07 PM IST

కర్తవ్యం వర్సెస్ కన్నీరు.. ఎస్సై భావోద్వేగ పోరాటం

KMM: సాధారణంగా ఖాకీ చొక్కా వెనుక కఠినత్వం ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఆ యూనిఫామ్ వెనుక కూడా ఒక స్పందించే గుండె ఉంటుందని నిరూపించే దృశ్యం ఇది. ఒక మహిళ ఎంతో ఆవేదనతో తన గోడును వెళ్లగక్కుతుంటే, అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై ఆమె బాధను చూసి చలించిపోయారు. ‘మా చేతుల్లో ఏమీ లేదమ్మా’ అంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.

March 2, 2026 / 04:06 PM IST

అంబటి రాంబాబు కలిసిన వైసీపీ నేతలు

ELR: చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ విజయరాజు ఆధ్వర్యంలో పలువురు నేతలు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం కలిశారు. ఇటీవల వివిధ కేసులలో అరెస్టు విడుదలైన రాంబాబును పలువురు నేతలు పరామర్శించారు. ప్రజా పరిపరిపాలనను గాలికొదిలేసి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం కొత్త కొత్త డ్రామాలను తెరపైకి తెస్తున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

March 2, 2026 / 04:06 PM IST

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతుల స్వీకరణ

KRNL: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇవాళ జిల్లా కలెక్టర్ ఏ.సిరి, JC నూరుల్ కమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధశాఖలకు చెందిన అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కారం చూపాలన్నారు.

March 2, 2026 / 04:06 PM IST

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్డీవో

JGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెట్‌పల్లి డివిజన్ ఆర్డీవోగా నూతన బాధ్యతలు స్వీకరించిన జి. నరసింహరావు సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందజేయగా, కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

March 2, 2026 / 04:05 PM IST

VO భవన నిర్మాణానికి భూమి పూజ

NLG: చండూరు మండలం కోటయ్యగూడెంలో వీవో (VO) భవన నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి దోహదపడే ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాలెంక రాంబాబు, ఉపసర్పంచ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 04:05 PM IST

కాగజ్ నగర్‌లో శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి భిక్షాటన

ASF: కాగజ్ నగర్ పట్టణంలో శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా MLA హరీష్ బాబు కలిసి ఆయన ఆశీర్వాదలు తీసుకున్నారు. రామానుజ జీయర్ స్వామి మార్కెట్ ఏరియా గుండా వారు మిర్యాలగూడలో జరపనున్న మహాలక్ష్మి యాగ నిమిత్తం భిక్షాటన చేశారు. అనంతరం MLA కి స్వామి వారు మంగళ శాసనాలు అందజేశారు.

March 2, 2026 / 04:05 PM IST

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

AP: ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాణసంచా ప్రమాదాలపై శివకాశీ వెళ్లి అధ్యయనం చేయాలి. రాష్ట్ర ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. బస్‌స్టేషన్‌లలో టాయిలెట్స్ మరమ్మతులు చేయాలి. ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. నిజాయితీ గల అధికారులను నియమించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’ అని సూచించారు.

March 2, 2026 / 04:05 PM IST