• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలి’

శాసనమండలలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామిని అవమానించి అపచారం చేశారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ విమర్శించారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణం గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, ఆలయ సంప్రోక్షణ చేశారు. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 06:43 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

TPT: సైదాపురం నుంచి రాపూరు వెళ్లే దారిలో జగనన్నా లేఅవుట్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిందా లేదా మరో వాహనం వీరిని ఢీకొట్టిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 06:43 AM IST

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉదయం 8:30 కు రాష్ట్ర పండుగగా గుర్తింపు పోందిన రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గోననున్నారు. అనంతరం 11కు చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరుకానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.

February 22, 2026 / 06:40 AM IST

ఇక ప్రొద్దుటూరుకు నాన్ స్టాప్ బస్సులు ఉండవు

KDP: జమ్మలమడుగు RTC డిపో నుంచి ప్రొద్దుటూరుకు 9 నాన్ స్టాప్, 3 పల్లెలకు సర్వీసులు ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి 12 సర్వీసులను పల్లె వెలుగు బస్సులు గా మారుస్తున్నట్లు డిపో మేనేజర్ సుబ్బమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈనెల 26 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 06:39 AM IST

మాల్ ప్రాక్టీస్‌లో.. 17 మంది డిబార్

KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరిగిన UG పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 17 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు ఉపకులపతి వెంకట బసవరావు నిన్న తెలిపారు.సెయింట్ జోసెఫ్, YMR సిద్ధార్థ కాలేజీల్లో ముగ్గురు, శ్రీ వైష్ణవి, శ్రీ రాఘవేంద్ర, సెయింట్ జోసెఫ్ ఉమెన్, YMR జీడీసీల్లో ఇద్దరు, నంద్యాల, డోన్ జీడీసీ, ఆలూరు వెంకటేశ్వర కాలేజీల్లో ఒక్కొక్కరు ఉన్నారు.

February 22, 2026 / 06:38 AM IST

చిలకలూరిపేట అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి సమీక్ష

PLD: చిలకలూరిపేట పట్టణ సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

February 22, 2026 / 06:38 AM IST

బ‌స్సు ఢీకొని వ్య‌క్తికి గాయాలు

VSP: ఆనందపురం మండలం బోయిపాలెం వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న కొట్టా అప్పారావును ఆనందపురం నుంచి విశాఖ‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన రోడ్డుపై పడిపోవడంతో కుడి భుజం, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 06:37 AM IST

దొంగ వస్తువులు కొనుగోలు.. యజమాని అరెస్ట్

ADB: దొంగ వస్తువులు కొనుగోలు చేసిన ముజాహిద్ అనే స్క్రాప్ దుకాణ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోథ్ CI గురుస్వామి నిన్న తెలిపారు. దిగ్నూర్ గ్రామానికి చెందిన కొరెల్లి రామకృష్ణ అనే వ్యక్తి బోర్‌వెల్ పైపులను దొంగలించి ముజాహిద్‌కు అమ్మినట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 06:37 AM IST

నంబూరు-ఎర్రుపాలెం రైల్వే లైన్ పనుల్లో వేగం

GNTR: నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం యార్డ్ ఆధునీకరణ, పెద్దాపురం వరకు 3.52 కిలోమీటర్ల మేర కొత్త పట్టాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ. 36.2 కోట్ల వ్యయంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ అడుగుతో కొత్త రైల్వే లైన్ కల సాకారం దిశగా పనులు మరింత వేగవంతం కానున్నాయి.

February 22, 2026 / 06:36 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆనందబాబు ఆకస్మిక తనిఖీ

BPT: వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.

February 22, 2026 / 06:35 AM IST

విజయనగరంలో నేటి చికెన్ ధరలు

విజయనగరంలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ బ్రాయిలర్ చికెన్ సుమారు ₹285కు, స్కిన్‌లెస్ ₹275కు, బోనెలెస్ ₹295 వరకు విక్రయించబడుతోంది. నాటు కోడి ధరలు మాత్రం ₹300 పైగా ఉన్నాయి. షాపుల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:35 AM IST

పెండింగ్ క్లెయిములను పరిష్కరించాలని వినతి

W.G: భీమవరంలో భవన, ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమం ఎఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పెండింగులో ఉన్న 46 వేల క్లెయిములను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కార్మికశాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్‌కు యూనియన్ తరఫున వినతిపత్రం అందజేశారు.

February 22, 2026 / 06:34 AM IST

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRCL: జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్‌లో సమర్పించాలన్నారు.

February 22, 2026 / 06:33 AM IST

జిల్లాలో 64 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు: RIO

ATP: జిల్లాలో ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆర్ఐవో వెంకట రమణనాయక్ తెలిపారు. మొత్తం 64 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఉదయం 8.15 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 24,568 మంది, ద్వితీయ సంవత్సరంలో 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

February 22, 2026 / 06:32 AM IST

బైక్‌ను ఢీ కొన్న ట్రాక్టర్.. ఇద్దరకి తీవ్ర గాయాలు

MNCL: మందమర్రి పట్టణం పులిమడుగు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందన్నారు.

February 22, 2026 / 06:32 AM IST