KMM: చింతకాని మండలంలో 50% రాయితీపై ట్రాక్టర్లు, రోటవేటర్లు ఇస్తామని నమ్మించి ఓ ముఠా 55 మంది రైతుల నుంచి రూ. కోటికి పైగా వసూలు చేసింది. కొత్తగూడెం కేంద్రంగా కార్యాలయం తెరిచి, ఫోన్పే, బ్యాంకుల ద్వారా నగదు జమ చేయించుకుని పరారైంది. తొలుత కొందరికి తక్కువ ధరకు యంత్రాలిచ్చి నమ్మకం కలిగించి ఈ మోసానికి పాల్పడ్డారు.
JGL: సీఎం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పెగడపల్లి మండల కేంద్రంలోని ZP ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పాఠశాల HM లలిత, ఫిజికల్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. 10వ తరగతి చదువుతున్న యోగేశ్ జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగేశ్ను ఎంఈవో, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో త్వరలో సోలార్ ఎనర్జీ అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మూడు గ్రామాలను ఎంపిక చేయగా అందులో వెంకట్రావుపేట ఒకటి. ఆ గ్రామానికి మొత్తం 1139 సోలార్ యూనిట్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. అందులో ప్రస్తుతం 400 సోలార్ యూనిట్లను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో గ్రామంలో సోలార్ ఎనర్జీ అందుబాటులోకి రానుంది.
JN: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్ ద్వారా వివిధ గ్రామాలకు నీరు అందించేందుకు గాను కాలువల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులను నేడు జనగామ గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు ప్రారంభించారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఛైర్మన్ అన్నారు.
KNR: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులు కీలకపాత్ర పోషించాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో స్థానిక సర్పంచులకు ట్రైనింగ్ జరిగింది. పంచాయతీ రాజ్ చట్టంపై సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సంక్షేమ పథకాలతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా ఒక్కింటికి రూ. 5,875 వేల చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. పూర్తి వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని పెద్ద కమ్మవారిపల్లిలో శ్రీ చెన్నకేశవ స్వామి, పోతలయ్య, బంగారు లింగమయ్య వార్షిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. దారపునేని చంద్రశేఖర్ నివాసం నుంచి స్వామివారి వెండి కవచాలను ఉరుము, డప్పు వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు యలువగంప మహోత్సవం నిర్వహించారు.
RR: కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ సందర్భంగా లే మామిడి గ్రామానికి చెందిన పలువురు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ATP: YSR కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత పర్యటనలో భాగంగా వీరు వెళ్లినట్లు తెలుస్తోంది. విమాన ప్రయాణంలో నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై జగన్ చర్చించినట్లు సమాచారం.
NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో మెప్మా సహకారంతో సారీ రోలింగ్ షాపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి షాపును ఓపెన్ చేశారు. పొదుపులో వచ్చే రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణాలను అందజేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలన్నారు.
NGKL: జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారిని అవమానించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని మిత్రమండలి వెల్దండ ఎస్సై కురుమూర్తికి ఫిర్యాదు చేసింది. అజిలాపూర్ గ్రామానికి చెందిన సిద్దమోని రమేష్ గౌడ్, బుచ్చిబాబులపై చట్టపరమైన చర్యలు కోరారు. మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు మట్ట పరమేష్ గౌడ్, యాదగిరి, శివ, రాజు తదితరులు వినతిపత్రం అందజేశారు.
MDK: రేగోడ్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న DEO విజయ వెంటనే పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సహకారంతో విద్యార్థులకు తగిన చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
SRD: అనంతారంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు రూ.20 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్లకు రూ.10 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
షుగర్, ఊబకాయం వంటి రోగాలు దరిచేరవద్దంటే కొన్ని అన్హెల్తీ ఫుడ్స్కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ‘వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటి పండి పదార్థాల వాడకం తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. స్వీట్లు, కేక్, చాక్లెట్లతో పాటు మద్యానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లు, చిప్స్ తినొద్దు’ అని చెప్పారు.
కృష్ణా: గుడూరు పరిధిలోని చిట్టిగూడూరు గ్రామ శివారులో ఎస్సై దివ్య ప్రకాష్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.