• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తెలుగు భాషకు సేవ చేస్తున్న కవులకు సత్కారం

ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భీమవరం JLB స్కూల్లో విద్యార్థినిలు భువన విజయం రూపకం శుక్రవారం ప్రదర్శించారు. మాతృభాష అభ్యున్నతికి పాటుపడుతున్న కలిగొట్ల గోపాలశర్మ, సాగిరాజు సత్యనారాయణరాజు, వేము వెంకటకృష్ణమోహన్, తెలుగు అధ్యాపకులు రోహిణి, మౌనిక భవానిలను సత్కరించినట్టు HM కృష్ణకుమారి, అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఇందులో రిటైర్డ్ MEO.సీతారామరాజు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:35 PM IST

ఫ్రైడే డ్రైడేలో సూచనలు చేసిన డీఎంహెచ్వో

PPM: వ్యాదుల మూల కారణాలపై దృష్టి సారించి నియంత్రణ చర్యలు చేపట్టాలని DMHO డా ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఉల్లిభద్ర గ్రామంలో శుక్రవారం ఆయన సందర్శించి అక్కడ ఫ్రైడే డ్రైడే నిర్వహణ తీరు పరిశీలించారు. గ్రామంలో గృహ సందర్శనలు చేస్తూ పరిసరాల్లో నీటి తొట్టెలు, కాల్వలు పరిశీలించారు. లార్వా ఉనికి ప్రదేశాలను నియంత్రణ చెయ్యాలి అన్నారు.

February 20, 2026 / 06:35 PM IST

ఈ నెల 21వ తేదీ నుంచి అదనపు కేంద్రాలు ప్రారంభం

ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో అదనంగా 15 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి కొత్త కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 6 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల ప్రకారం శనగ క్వింటాల్‌కు రూ. 5,875 చెల్లించబడుతుందని తెలిపారు.

February 20, 2026 / 06:35 PM IST

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

BPT: పిడుగురాళ్ల–వాడరేవు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్చూరు వైపు వస్తున్న కారు, బైక్ బలంగా ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పర్చూరు SI పులి గోపి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 06:34 PM IST

బీసీ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం: పెద్దారవీడు గ్రామ పంచాయతీలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను ఎంపీడీవో జాన్ సుందరరావు ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

February 20, 2026 / 06:34 PM IST

ఉండిలో పర్యటించిన జేసీ

W.G: ఉండి మండలం చిన్నపులేరు గ్రామంలో జేసీ టీ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. పట్టాదారు పాస్ పుస్తకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందులో ఆర్డీఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె. జాషువా, MRO నాగార్జున పాల్గొన్నారు.

February 20, 2026 / 06:33 PM IST

BREAKING: ఐదుగురు పిల్లలు మృతి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా నియామత్ పూర్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఊరేగింపులోని డీజే వాహనం ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగలడంతో విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:33 PM IST

ఏకసభ్య కమిషన్‌ను తప్పుపట్టిన భూమన

AP: ఏకసభ్య కమిషన్ నియామకాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు. ఇది పూర్తిగా రాజకీయ ఎత్తుగడనేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కోరుకున్నట్లు సీబీఐ విచారణ జరగలేదని.. అందుకే రిటైర్డ్ అధికారితో కమిషన్ వేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టును అవమానించడమేనని పేర్కొన్నారు.

February 20, 2026 / 06:32 PM IST

నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభం

CTR: తిరుపతి నుంచి రంగంపేట, భీమవరం, కొత్తపేట, పులిచెర్ల మీదుగా కల్లూరుకు నూతనంగా ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు RTC అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి బస్సు బయలుదేరి మధ్యాహ్నం 12:45కు కల్లూరుకు చేరుకుంటుందన్నారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి ఇదే మార్గంలో తిరుపతికి వెళుతుందన్నారు.

February 20, 2026 / 06:31 PM IST

5 రోజుల్లోనే రైతులకు డబ్బులు జమ: జేసీ

నెల్లూరు జిల్లాలో శెనగ పంటను క్వింటాలకు రూ. 5875 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామన్నారు. విక్రయించిన ఐదు రోజుల్లోనే నగదు జమ అవుతుందన్నారు.

February 20, 2026 / 06:30 PM IST

దేవస్థాన పనులకు కొటేషన్లు ఆహ్వానం

KNR: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ఇంగిలే రామారావు, ఈవో సుధాకర్ తెలిపారు. పందిళ్లు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ టీవీలు, అన్నదాన సామగ్రి, పెయింటింగ్ వంటి పనులకు ఆసక్తి గలవారు రూ.500 చెల్లించి, ఈ నెల 24న ఉదయం 11 గంటలలోపు కొటేషన్లు సమర్పించాలని వెల్లడించారు.

February 20, 2026 / 06:30 PM IST

ఫోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం అంగులూరు ప్రభుత్వ పాఠశాలలో ఫోక్స్ చట్టంపై SI సత్యనారాయణ శుక్రవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల తమపై జరిగే వేధింపుల పట్ల మౌనంగా ఉండకూడదని తెలిపారు. ఫోక్స్ చట్టం ద్వారా లభించే రక్షణ గురించి వివరించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:30 PM IST

‘స్టేట్ సెంట్రల్ లైబ్రరీ సంస్కృతికి ప్రతీకగా నిలవాలి’

GNTR: ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. త్వరలో నిర్మించబోయే సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించారు.

February 20, 2026 / 06:30 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

NLG: మునుగోడు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవి గూడెంకు చెందిన రేషన్ డీలర్ ఉడుత సైదులు సోదరుని వివాహ వేడుక ఇవాళ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలోని రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

February 20, 2026 / 06:30 PM IST

జాగ్రత్త: అతిగా ఉప్పు వాడుతున్నారా..?

మనం ఆహారంలో రుచి కోసం వాడే ఉప్పును పరిమితం చేయాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు రావడం, ఎముకలు బలహీనపడటం జరుగుతుంది. ప్యాక్ చేసిన చిప్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్స్‌లో ఉప్పు మోతాదు అధికంగా ఉంటుంది. కాబట్టి, వాటికి దూరంగా ఉండాలి.

February 20, 2026 / 06:30 PM IST