AP: ఏకసభ్య కమిషన్ నియామకాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు. ఇది పూర్తిగా రాజకీయ ఎత్తుగడనేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కోరుకున్నట్లు సీబీఐ విచారణ జరగలేదని.. అందుకే రిటైర్డ్ అధికారితో కమిషన్ వేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టును అవమానించడమేనని పేర్కొన్నారు.