కృష్ణా: కూటమి ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి వెలుగుల్లో వెలుగుతున్నాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మండలం సాయిపురం, ముదునూరు జాగర్లపూడి పల్లెల్లో ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.