W.G: ఉండి మండలం చిన్నపులేరు గ్రామంలో జేసీ టీ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. పట్టాదారు పాస్ పుస్తకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందులో ఆర్డీఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె. జాషువా, MRO నాగార్జున పాల్గొన్నారు.