SRD: రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా కృషిచేసి మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ తొలి మున్సిపల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీలోని పారిశుద్ధ్యం, నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన మంచి అంశాలపై దృష్టి సారించాలన్నారు.