AP: అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. త్వరలో 7 వేల ఆయా పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 257 ICDS ప్రాజెక్టులు, 55,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని.. గతంలో 70గా ఉన్న హాజరు శాతం ప్రస్తుతం 96కి పెరిగిందని చెప్పారు.