TG: జిల్లా కలెక్టర్లు నెలకు కనీసం 10 రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. క్షేత్ర పర్యటనలు చేయని పక్షంలో ప్రజల సమస్యలు అర్థం కావని, పనితీరు ఆధారంగానే పోస్టింగ్లపై నిర్ణయం ఉంటుందని హెచ్చరించారు. అలాగే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు.