AP: కృతజ్ఞతకు ఆశకూ పోటీ పెడితే ఆశే గెలుస్తుందని మాజీమంత్రి బుగ్గన అన్నారు. ఆ ఆశను కూటమి సృష్టించిందని.. ఆ ఆశలోనే ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోవడం ఇది మొదటిసారి కాదన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమం అంతా అనవసరమైనదని ప్రచారం చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తామని ఆశచూపి, అధికారం రాగానే ప్రజలను మోసం చేశారని విమర్శించారు.