NZB: చందూర్ మండల కేంద్రంలోని నర్సరీని సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి బుధవారం పరిశీలించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం ప్రారంభమవుతున్న దృశ్య మొక్కలు వాడిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురేఖ సాయిలు, పంచాయతీ కార్యదర్శి సాయిలు , వార్డు సభ్యులు తదితరులున్నారు.