AKP: తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని నాతవరం మండల సమగ్ర శిక్ష ఉద్యోగుల అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాతవరం ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వేతనాలు, టైమ్ స్కేల్ అమలు, హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత వంటి సమస్యలు ఇంకా పరిష్కారమవ్వలేదని వెల్లడించారు.