సత్యసాయి: సోమందేపల్లిలో బాణాసంచా వ్యాపారులకు ఎస్ఐ రమేశ్ బాబు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇళ్లలో లేదా అనుమతులు లేని గోదాముల్లో బాణాసంచా నిల్వ ఉంచరాదని వారికి హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రైడ్స్ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.