TG: పుదుచ్చేరి, కేరళం రాష్ట్రాల్లో కాంగ్రెస్దే గెలుపు అని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. కేరళం సీఎం పినరయి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీతో కలిసిపోయారని ఆరోపించారు. రాహుల్ ప్రశ్నలకు పినరయి సమాధానం చెప్పలేదన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడున్నారని ఫైర్ అయ్యారు.