AP: కల్తీ నెయ్యిపై విచారణకు వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. టెండర్ ప్రక్రియ.. జరిగిన లోటు పాట్లకు సంబంధించి వన్ మ్యాన్ కమిటీ అధ్యయనం చేయనుంది.