AP: శాసన మండలిలో YCP ఆందోళనల నడుమ కూటమి నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో.. TDP, జనసేన, BJP ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వైసీపీ చర్యలతో తిరుమల వెంకన్నకు సభలో అవమానం జరిగిందని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని నేతలు నిర్ణయించుకున్నారు. క్షమించారని ఈ నేరాన్ని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు.