TG: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్, సీఎం రేవంత్ తీరు ఒకటే అని అన్నారు. యూపీలో ఎలాగైతే బుల్డోజర్ తో మసీదులు, దర్గాలు కూల్చారో.. అలాగే తెలంగాణలోనూ కూల్చేస్తున్నారని విమర్శించారు. ముస్లింల ప్రస్తావన వస్తే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ ను క్షమించి మద్దతిచ్చామన్నారు. దేశంలో మత ఘర్షనలకు కాంగ్రెస్సే కారణమన్నారు.