AP: హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. చెప్పులేసుకుని దేవుడి ఫొటోలతో సభలోకి రావడం క్షమించరాని నేరమని విమర్శించారు. దేవుడి ఫొటోలు విసిరేయడం అవమానకరమన్నారు. హిందువులను అవమానించినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడు అంటే జగన్తో సహా వైసీపీ నేతలకు భయం, భక్తి లేవన్నారు.