AP: పాలు కల్తీ జరిగి మనుషులు చనిపోవడం ఏంటని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. గ్రామస్థాయి నుంచి కూడా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. సభ సజావుగా జరగాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవట్లేదు. అందుకే శాసనమండలి నుంచి వాకౌట్ చేశాం’ అని వెల్లడించారు.