AP: భార్యాభర్తల వివాదంలో జోక్యం చేసుకుని బెదిరించిన కేసులో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మరో 11 మందికి నోటీసులు ఇస్తూ భీమడోలు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, గతంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు వారందరిపై హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ తదుపరి చర్యలు ముందుకు సాగలేదు.