రోజూ ఎక్కువ సమయం నిద్రపోతున్నా ఉదయాన్నే నీరసం, చిరాకుగా ఉంటే అది నిద్రలేమి సమస్యే. నాణ్యమైన నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి తగ్గి, ఏకాగ్రత దెబ్బతింటుంది. ముఖ్యంగా ‘స్లీప్ అప్నియా’ వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. మెరుగైన నిద్ర కోసం చేపలు, గుమ్మడి గింజలు, బాదం లేదా రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తీసుకోవాలని పేర్కొంటున్నాయి.