AP: ఇరిగేషన్ శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో చేపట్టాల్సిన పనుల అంచనాల రూపకల్పనలో ఆలస్యంపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రంలోగా అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విఫలమైన సీఈలు సోమవారం స్వయంగా వివరణ ఇవ్వాలన్నారు.