AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సత్యసాయి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోని 37 కరవు ప్రభావిత మండలాల్లో ఉపాధిహామీ పథకం శ్రామికులకు అదనంగా 50 రోజుల పనిదినాలు కల్పించనుంది. ప్రస్తుతం అందిస్తున్న 100 పనిదినాలకు ఇవి అదనం. మార్చి 31 లోపు మొత్తం 150 పనిదినాలను వినియోగించుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.