AP: BACలో మూడు అంశాలపై చర్చించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ‘పంటలకు గిట్టుబాటు ధరపై మండలిలో చర్చ జరగాలని కోరాం. యూనివర్సిటీ పేరుతో విశాఖలో రైతుల భూములను దోచుకోవాలని చూస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూముల దోచిపెట్టాలనే ఆలోచనపై చర్చించాలని డిమాండ్ చేశాం. తిరుమల లడ్డూ అంశంపైనా చర్చ జరగాలని అడిగాం’ అని వెల్లడించారు.