అస్సాం అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ ‘ఐదు గ్యారంటీ’లతో ప్రజల ముందుకు వెళ్తోంది. ప్రధానంగా CAA రద్దు, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహిణులకు రూ. 2,000 నగదు సాయం, టీ ఎస్టేట్ కార్మికుల కనీస వేతనం రూ. 365కు పెంపు, 5 లక్షల ఉద్యోగాల కల్పన వంటి హామీలను ప్రకటించింది. గతంలో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్కు విజయాన్ని అందించిన ‘గ్యారంటీ మోడల్’నే అస్త్రంగా వాడుతోంది.