AP: YCP పాలనలో జరిగిన అరాచకాలు మర్చిపోలేమని హోంమంత్రి అనిత అన్నారు. ‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అవమానించారు. పవన్ను రోడ్డుపై కూర్చోబెట్టారు, బయటకు రానివ్వలేదు. లోకేష్ పాదయాత్రను అడ్డుకుని దాడికి యత్నించారు. ప్రజావేదిక కూల్చి శకలాలు తీయకుండా సైకోయిజం చూపించారు. పోలీసు వ్యవస్థను శాంతిభద్రతల కోసం కాకుండా రాజకీయాల కోసం పనిచేసేలా మార్చివేశారు’ అని పేర్కొన్నారు.