TG: రాష్ట్రంలో నేతల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసించడంపట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయన్నారు. కానీ ‘నిజంగా ప్రజల మనసులో ఏం ఉంది? మనం ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం అన్నది ముఖ్యం’ అని అన్నారు. అన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.