AP: అసహ్యంగా మాట్లాడితే కేసులు పెట్టాలి కానీ దాడులు చేస్తారా? అని కూటమి నేతలను వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. గ్రూపులుగా వచ్చి తన ఇంటిపై దాడి చేశారని, ఆ సమయంలో ఇంట్లో తన పిల్లలు, మనవళ్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోండి అని చెప్పారని విమర్శించారు. ఇంటిపై దాడులు చేయడమే కాక అరెస్ట్ చేసి 18 రోజులు జెలులో పెట్టారని మండిపడ్డారు.