AP: జనసేన ఐదోవిడత సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘జెన్జీ సరికొత్తగా ఆలోచిస్తోంది. వారి ఆలోచనలు పార్టీకి ఉపయోగపడతాయి. యువనాయకత్వాన్ని పెంపొందించాలి’ అని సూచించారు. అలాగే, స్థానిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను వీరమహిళలు అందిపుచ్చుకుని సభ్యత్వనమోదులో మహిళల్ని పార్టీకి దగ్గర చేయాలని అన్నారు.