TG: భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడలను మక్తల్లో నిర్వహించేలా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం కప్లో భాగంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను వెలికి తీస్తామన్న మంత్రి.. 33 జిల్లాల నుంచి 66 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు.