AP: ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి సాగునీరు, స్టీల్ ప్లాంటుకు నీరు ఇవ్వటమే లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీరు ఇవ్వాలన్నదే ఆలోచన అని పేర్కొన్నారు. ఫేజ్-1, 2 పనుల కోసం బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించామని చెప్పారు. ఉత్తరాంధ్రలో మిగతా ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తామన్నారు.