జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం ఉప్పైరు గ్రామంలో కుమ్మరి మురళి అనే యువకుడు గురువారం అర్థరాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.