AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ ముగించింది. సుదీర్ఘంగా 6 ఏళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ తుది నివేదికను కోర్టుకు సమర్పించగా, కోర్టు దాన్ని ఆమోదించి కేసును మూసివేసింది. 2019లో రీపోస్టుమార్టం కోసం వెలికితీసిన ఆయేషా శరీర అవశేషాలకు ఈ నెల 27న ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.