AP: విశాఖ ప్రపంచస్థాయి నగరంగా మారుతోందని, ఇక్కడికి పెట్టుబడులు క్యూ కడుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని, దానిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.