TG: రాష్ట్రంలో పత్తి రైతులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్ల గడువును సీసీఐ పొడిగించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, రైతులందరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.