AP: రంజాన్ వేళ పేదింట్లో మంత్రి లోకేష్ పండుగ కాంతులు నింపారు. మంగళగిరికి చెందిన షహెన్షా ఇంటికి గతేడాది ఆయన ఇఫ్తార్ విందుకు వెళ్లారు. షహెన్షా ఇంటి పరిస్థితిని చూసి నూతన గృహం నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏడాది తిరగకముందే రెండంతస్తుల ఇంటిని కట్టించి అందించారు. ఈ సందర్భంగా షహెన్షా లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు.